అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల అధికారుల తనిఖీలు
Published on: Fri Nov 15, 2024 3:53PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను అధికారులు పలుమార్లు తనిఖీలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల అధికారులు ఏకపక్షంగా విమర్శలు చేశారు.
ఆయన విమర్శల ఫలితమా లేక నిజంగానే అనుమానం వచ్చిందో తెలియదు కానీ తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. బ్యాగులను పరిశీలించారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అమిత్ షా హెలికాప్టర్ లో ఎన్నికల అధికారుల తనిఖీ ఘటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.


