ఒడిశా సీఎంపై గుడ్లదాడి..

తన పాలనాదక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్న ముఖ్యమంత్రి  ఆయన. అందుకే ప్రజలు వరుసగా నాలగవసారి ఆయనకే సీఎం పీఠాన్ని కట్టబెట్టారు. అలాంటి వ్యక్తిపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు ఒడిషా ముఖ్యమంత్రి, బీజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్. మయూర్‌భంజ్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం..సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించేందుకు ఆయన సిద్ధమవుతుండగా ఓ యువకుడు కోడిగుడ్లతో నవీన్ పట్నాయక్‌‌పై దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రికి రక్షణగా నిలిచారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేడీ కార్యకర్తలు అతనిని చుట్టుముట్టి చితకబాదారు..అనంతరం పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.