సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

 

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హిందువులను కించపరిచేవిధంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. మార్చి 17న కరీంనగర్‌ బహిరంగ సభలో కేసీఆర్ 'హిందూగాళ్లు.. బొందుగాళ్లు.. దిక్కుమాలిన దరిద్రపుగాళ్లు' అని హిందువులను కించపరిచేలా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేసీఆర్‌ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసీఆర్‌ ప్రసంగం కాపీని పరిశీలించిన ఈసీ.. సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. గడువులోగా వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.