TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనాలు

Published on: Sun Apr 5, 2026 8:45AM

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో  ఆదివాకం (ఏప్రిల్ 5) తెల్లవారుజామున   భూమి కంపించింది. జనం అంతా గాఢ నిద్రలో ఉన్నవేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో క ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న విశాఖపట్నంలో కూడా కనిపించింది.  భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగుతు తీశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్  సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని   భూకంప కేంద్రంగా   గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి. 

తెల్లవారుజామున సుమారు 4:19 గంటల సమయంల  విశాఖపట్నంలోని అరిలోవ, మాధవధార, ఆక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, గాజువాక వంటి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా మంచాలు కదలడం, గృహోపకరణాలు కిందపడటంతో తీ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. 

ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలోనూ ఇటువంటి స్వల్ప ప్రకంపనలు అక్కడక్కడా సంభవించిన దాఖలాలు ఉన్నాయి. భూమి లోపల ఉండే ప్లేట్ల కదలికల వల్ల ఇలాంటి స్వల్ప భూకంపాలు సంభవిస్తాయని భూగర్భ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.