నేపాల్ లో కంపించిన భూమి
Published on: Fri Feb 28, 2025 8:20AM

నేపాల్ లో శఉక్రవారం తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం సింధుపాల్ లో ఉన్నది.
తెల్లవారు జాము 2.50 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో నిద్ర నుంచి లేచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. కాగా భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలలో కూడా భూమి కంపించింది.


