ఇచ్ఛాపురంలో కంపించిన భూమి
Published on: Thu Jan 9, 2025 9:00AM
.webp)
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బుధవారం (జనవరి 8) రాత్రి పొద్దుపోయిన తరువాత భూమి కంపించింది. ఆ తరువాత మరికొన్ని గంటలకు అంటు గురువారం (జనవరి 9) తెల్లవారు జామున మరో మారు భూ ప్రకంపనలు సంభవించాయి.
ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే భూమి స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికి పోయారు. రోడ్లపైకి పరుగులు తీశారు.


