ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ బుధవారం విడుదలయ్యింది. దీని ప్రకారం ఆగస్టు 7 నుండి 23 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. కౌన్సెలింగ్ కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 57 కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. మొదటి రోజు ఒకటి నుంచి ఐదు వేల ర్యాంక్ లోపు వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ 2,15,336 విద్యార్ధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు 'బి' కేటగిరీ సీట్లు భర్తీ చేయవద్దని ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ అధికారులకు సూచించింది.