ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనివ్వం: ఓయు విద్యార్థులు

 

ఆగస్టు 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు స్పందించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనివ్వమని ప్రకటించారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయడానికే ఉన్నత విద్యామండలి ఇలా వ్యవహరిస్తోందని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు పిడమర్తి రవి, బాలరాజు ఆరోపించారు. ఈ విషయం మీద సుప్రీం కోర్టు తీర్పు ఆగస్టు 4న వచ్చే అవకాశం వుందని, ఈలోపే ఉన్నత విద్యామండలి 7 నుంచి కౌన్సిలింగ్ చేస్తామని ప్రకటించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు.