కేజ్రీవాల్ మాదిరిగా చేస్తున్నారు కేసీఆర్..

 

కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ కేసీఆర్ పై విమర్సల బాణాలు వదిలారు.  తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన కేసు పెండింగ్ లో ఉండగా, కేంద్రం ఏమీ చేయలేదన్న సంగతి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం పదేళ్ల పాటు హైకోర్టు హైదరాబాద్లో ఉండటానికి విభజన చట్టం కల్పించిందని.. అది కూడా తెలియకుండా..ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తానని కేసీఆర్ మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. చంద్రబాబు చొరవతోనే హైకోర్టు విడిపోతుందని కేసీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. వాస్తవాన్ని పక్కనబెట్టి కేజ్రీవాల్ మాదిరిగా, ధర్నాలు, నిరసనలు తెలిపితే తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, శాంతిభద్రతల సమస్యలు తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదని సదానందగౌడ అభిప్రాయపడ్డారు.