గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ

దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో మూడో రోజైన ఈ రోజు దుర్గమ్మ వేదమాత గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేకువ జాము నుంచే భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. వేద స్వరూపిణియైన గాయత్రిమాతను పూజిస్తే మంచి మేధస్సుతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.