26 రోజులు పూజ చేసారు.. చంపేశారు.!!

తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలో గత 26 రోజులుగా పూజలు అందుకున్న నాగుపాము ఈరోజు మరణించింది.. 26 రోజుల క్రితం ఒక పొలం దగ్గర కనిపించిన ఆ పామును గ్రామస్తులు సుబ్రహ్మణ్యం స్వామి స్వరూపం అంటూ దైవంలా కొలిచారు.. ఆ పాము వారి శరీరంపై పాకినా కూడా కాటు వేయలేదు.. దీంతో గ్రామస్తులు విరామం లేకుండా ఆ పాముకి పూజ చేసారు.. అయితే అకస్మాత్తుగా పాము ఈరోజు మరణించడంతో వారు విషాదంలో మునిగిపోయారు.. మరోవైపు ఆ పాము చనిపోయిన చోట గుడి కడతామని చెప్తున్నారు.

 

 

అయితే నాణానికి రెండో వైపు అన్నట్టు ఈ విషయాన్ని రెండో కోణంలో కూడా చూడాలి.. మనుషులుగా మనం స్వేచ్ఛను ఎలా కోరుకుంటామో ఇతర ప్రాణులు కూడా స్వేచ్ఛను అలానే కోరుకుంటాయి.. అది పట్టించుకోకుండా ఒక పామును పూజల పేరుతో చుట్టూ చేరి దాన్ని బందీ చేయడం ఎంతవరకు కరెక్ట్.. దీనికితోడు మీడియా కూడా ఈ విషయంలో అత్యుత్సాహం చూపించింది.. కొన్ని ఛానెల్స్ అయితే పనిగట్టుకొని మరీ పదేపదే చూపించాయి.. దీంతో జనాలు తాకిడి పెరిగింది.. చుట్టూ జనాలు చేరితే పాపం పాము మాత్రం ఎక్కడని వెళ్తుంది.. దాని స్వేచ్ఛ పోయింది.. ఇప్పుడు ప్రాణమే పోయింది.. అంతా జరిగినపోయిన తరువాత ప్రాణం పోయిందని ఇప్పుడు బాధపడితే మాత్రం ఏం లాభం.