TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్కడ బొత్స ఇక్కడ డీయస్ జంపు

Published on: Tue Jun 30, 2015 9:26PM

 

మాజీ సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనకు మళ్ళీ రెండవసారి యం.యల్సీ పదవి ఇవ్వనందుకు పార్టీపై అలిగారు. తన పదవీ కాలం పూర్తయ్యి నెల రోజులయినా ఇంతవరకు పార్టీ అధిష్టానం తనను పట్టించుకోలేదని, ఈ విషయం గురించి మాట్లాడేందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను డిల్లీకి రమ్మని ఆహ్వానించలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. తనకు బీజేపీ, తెరాసల నుండి ఆహ్వానాలు అందాయని కానీ ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. తెరాసలో చేరితే ఆయనకి యం.యల్సీ పదవి కానీ రాజ్యసభ సభ్యత్వం గానీ ఇవ్వవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కనుక త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన మాటలు కూడా అదే సూచిస్తున్నాయి. అదే జరిగితే ఆంధ్రా నుండి ఒకరు తెలంగాణా నుండి ఒకరు చొప్పున ఇద్దరు మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు (బొత్స సత్యనారాయణ, డీ.శ్రీనివాస్) కాంగ్రెస్ పార్టీ నుండి జంప్ అయినట్లవుతుంది.