రంభ మీద వరకట్న వేధింపుల కేసు!

 

సినీ నటి రంభ మీద, ఆమె సోదరుడి మీద సోదరుడి భార్య వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. సినీనటి రంభ, తన భర్త అయిన ఆమె సోదరుడు తనను గత కొంతకాలంగా అదనపు వరకట్నం కోసం దారుణంగా వేధిస్తున్నారని, తనను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని రంభ మరదలు పల్లవి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు రంభ మీద, ఆమె సోదరుడి మీద కేసు నమోదు చేశారు. రంభ తరహాలోనే గతంలో కథానాయిక ఆమని మీద కూడా ఇలాంటి వరకట్నం కేసు నమోదైంది.