వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు

 

వైఎస్ వివేకానందరెడ్డి ఈరోజు తెల్లజామున మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో మృతిచెందారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాత్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉండటం.. తల, చేతికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ స్వ్కాడ్‌ను రంగంలోకి దించారు. వివేకానందరెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది.