ఆకలి గా ఉన్న వారి కడుపు నింపటమే నిజమైన ఈద్ ముబారక్

ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారి పై నెల రోజులుగా రోజు రెండు బృందాలుగా ఏర్పడి వలసకర్మికుల కడపు నింపే లక్ష్యం తో రోజు రెండుపూటలా భోజనం అందిస్తున్న ముస్లిం సోదరులు 'తెలుగువన్.కామ్' తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇద్దరు మిత్రులు మొదలు పెట్టిన తర్వాత ఎంతో మంది వారికి తమ వంతు సహాయం అందించారు. రంజాన్ పండుగ మాసం లో ఇంతమందికి తాము కడుపు నింపటం కన్నా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు అందించే సేవలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు అబిద్ అలి , నియాజ్ మిత్రబృందం.