యథా ట్రంప్ తథా అనుచరులు...

 

ఒకపక్క ట్రంప్ తన వ్యాఖ్యలతో ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ అనుచరులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య జర్నలిస్టులపై ట్రంప్ తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. పెనిస్విలేనియాలో ట్రంప్ నిర్వహించిన ఓ ఈవెంట్లో దాదాపు ఐదు వేల మంది పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగించిన అనంతరం.. మీడియా ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా.. దానికి ట్రంప్ జర్నలిస్టులతో మాట్లాడటం తనకు ఇష్టం లేదని, మీరు అబద్ధాలకోరులని తిట్టిపోశాడు. ట్రంప్ అనుచరులైతే రెచ్చిపోయి కొందరు జర్నలిస్టులను నెట్టివేస్తూ వారిపై చెయ్యి చేసుకున్నారు కూడా.  మీ చేతిలో ఉన్న మైక్స్ కింద పడేస్తాను అంటూ ట్రంప్ మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. అసలు మీరు ఎవరో తెలియదు, ఇక్కడి ఎందుకు వచ్చారంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మొత్తానికి యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. ట్రంప్ ఎలా ఉంటే వారి అనుచరులు కూడా అలాగే ఉంటారని అర్ధమైంది.