TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ పార్టీకి డొక్కా గుడ్ బై?

Published on: Sat Jul 11, 2015 11:54AM

 

 కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒకవెలుగు వెలిగిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైకాపాలో చేరబోతున్నారని తాజా సమాచారం. ఆయన తన అనుచరులతో కలిసి సోమవారం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపా కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ వెళ్ళిపోవడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదని దృవీకరించినట్లయింది. ఇప్పుడు డొక్కా కూడా వెళ్ళిపోతే మరో మారు దృవీకరించినట్లవుతుంది. ఆయన తరువాత ఇంకా ఎంతమంది కాంగ్రెస్ నేతలు బయటకి దూకేస్తారో చూడాలి.