కుక్కల దాడి: యువతి మృతి

 

మానసిక వికలాంగురాలైన ఒక యువతి మీద వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆ యువతి మృతిచెందింది. విశాఖ పరిసరాల్లోని వెంకోజీపాలెం కొండవాలు ప్రాంతంలో నివాసం వుంటున్న అప్పలరెడ్డికి మేరి (17) అనే మానసిక వికలాంగురాలైన కుమార్తె వుంది. మేరీని ఇంట్లో వుంచి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు బయటకి వెళ్ళారు. ఈ సమయంలో ఆరు కుక్కలు ఇంట్లోకి వచ్చి మేరీమీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మేరిని ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె మరణించింది.