హైకోర్టు ను ఆశ్రయించిన డాక్టర్ సుధాకర్

డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తనను ఈ నెల 16 నుంచి విశాఖలోని మానసిక వైద్యశాలలో నిర్బంధించారని ఆరోపించారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని, వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం తనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, హైకోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్ ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణకు రానుంది. పిటిషన్ లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య అరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా చేర్చారు.