ఆపరేషన్ సగంలో ఆపేసిన డాక్టర్..!!

డాక్టర్ ని దేవుడితో సమానం అంటారు.. కానీ కొందరు డాక్టర్ల ప్రవర్తన చూస్తుంటే దెయ్యం కంటే దారుణం అనిపిస్తుంది.. అలాంటి వారిలో ఒకరే తాడేపల్లి గూడెంలోని మదర్ వన్నిని హాస్పిటల్ లోని డాక్టర్ మహేష్.

 

 

తాడేపల్లిగూడెం మండలానికి చెందిన జుత్తిగ పార్థసారథి అనే వ్యక్తి, కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మదర్ వన్నిని హాస్పిటల్ లో చేరాడు.. అయితే సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పార్థసారథికి కిడ్నీలో స్టోన్ ఆపరేషన్ జరగాల్సి ఉండగా డాక్టర్ మహేష్ ఆలస్యంగా 7.30 గంటలకు చేరుకొని ఆపరేషన్ మొదలు పెట్టాడు.. సగం ఆపరేషన్ అయ్యాక స్టోన్ కిడ్నీ కిందకు ఉందని.. ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో కుదరదని.. తనకు డబ్బులిస్తే ఇప్పుడే స్టోన్‌ను తొలగిస్తానని లేకుంటే అలానే వదిలేస్తానని అన్నాడు.. అప్పటికప్పుడు వారు డబ్బులు ఇవ్వలేమనడంతో ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు.. డబ్బులు లేని కారణంగా డాక్టర్ ఇలా ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లడంతో అందరూ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.