చంద్రబాబును చూసి మీరిద్దరూ సిగ్గు తెచ్చుకోండి...

 

డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసించారు. తమిళనాడులోని ఈరోడ్ లో పార్టీకి సంబంధించిన బహిరంగసభలో పాల్గొన్న ఆయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీస్తున్నారని, పోరాటం చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన  పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలపై ఆయన నిప్పులు చెరిగారు. వీరిద్దరూ కేంద్రం ముందు సాష్టాంగపడి, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని...బలహీనమైన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ చెప్పుచేతల్లో పెట్టుకుందని... తద్వారా తమిళనాడుపై పెత్తనం చెలాయిస్తోందని మండిపడ్డారు. కావేరీ బోర్డు విషయంలో తమిళనాడును కేంద్రం వంచిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు ఉన్న తెగువ, స్వాభిమానం, పౌరుషం, పోరాటపటిమ పళని, పన్నీర్ లకు ఎందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.