కరుణానిధికి అస్వస్థత..


డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజుల నుంచి కరుణానిధి ఆరోగ్యం సరిగా ఉండటం లేదని పార్టీ ప్రకటించింది. కరుణానిధి ఆరోగ్యం కోలుకునే వరకు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. వైద్యుల సూచన మేరకు కరుణానిధిని కలిసేందుకు ఏవరూ రావొద్దని పార్టీ విజ్ఞప్తి చేసింది. కాగా ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత కొద్ది కాలంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.