కోర్టులో కలుసుకున్న గాలి, జగన్

అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఏ-2 నిందితుడు ఎంపీ విజయసాయి రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. తన కుమార్తె చదువు నిమిత్తం జగన్ లండన్‌కు వెళ్లారు..నిన్ననే ఆయన లండన్ నుంచి హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా జగన్ కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.