కేంద్రమంత్రి కొడుకు మీద హీరోయిన్ రేప్ కేసు...

 

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌గౌడ మీద రేప్ కేసు నమోదైంది. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ కన్నడ సినీ నటి మైత్రేయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కార్తీక్ గౌడపై పోలీసులు రేప్ కేసు నమోదు చేసి, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదికలో కార్తీక్ గౌడ మైత్రేయని రేప్ చేసినట్టు రుజువైతే కార్తీక్ గౌడని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. తనను కార్తీక్ గౌడ్ రేప్ చేశాడంతో మైత్రేయ బుధవారం మీడియా ముందు తెలిపింది. ఒక స్నేహితుడి ద్వారా తనకు పరిచయమైన కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకున్నట్టు నటించాడని, ఇప్పుడు తనపై అత్యాచారం జరిపాడని చెప్పింది. ఈ ఉదంతాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ ఖండించారు. తన కుమారుడి నిశ్చితార్థం రోజున ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కార్తీక్ గౌడ కూడా మైత్రేయ ఆరోపణలను తోసిపుచ్చాడు. తన తండ్రి ఉన్నతమైన వ్యక్తి అని, వివాదాల్లోకి లాగడం మంచిది కాదని వ్యాఖ్యానించాడు.