ధోని గౌరవార్థం... లాస్ట్ కెప్టెన్సీ.. ఫ్రీ ఎంట్రీ..

 

వన్డే, టీ20 సిరస్ కెప్టెన్సీ నుండి కూల్ కెప్టెన్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. ధోని రాజీనామా తరువాత ఈరోజు నుంచి నగరంలోని బ్రాబోర్న్ స్టేడియంలో మధ్యాహ్నం గం.1.30 ని.ల నుంచి ఇంగ్లండ్-భారత్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు మాత్రం ధోని సారథ్యం వహించనున్నాడు.  ధోని గౌరవార్థం ఒక మ్యాచ్లో కెప్టెన్సీ చేసే అవకాశాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కల్పించింది. అంతేకాదు ఆ మ్యాచ్కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నారు. సుమారు పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్లను ఇవ్వనున్నట్లు బీసీసీఐ తెలిపింది.