తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Wed Jun 28, 2023 10:40AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగానే స్వామి వారి దర్శనానికి భక్తులను పంపిస్తున్నారు.
టోకేన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. కాగా మంగళవారం (జూన్ 27) శ్రీవారిని 69వేల 143 మంది భక్తులు దర్శించుకున్నారు.
26వేల 145 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.38కోట్లు వచ్చింది.


