తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Wed Jul 16, 2025 9:37AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (జులై 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (జులై 15) శ్రీవారిని మొత్తం73 వేల 20 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 609 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 19లక్షల రూపాయలు వచ్చింది.


