తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sat Jul 12, 2025 9:06AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (జులై12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
శనివారం (జులై 11) శ్రీవారిని మొత్తం 70 వేల 217 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 158 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 84 లక్షల రూపాయలు వచ్చింది.


