తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Published on: Wed Jul 2, 2025 8:48AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేసవి సెలవలు ముగియడం, విద్యార్థులకు పరీక్షలు కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పలుచగా ఉంది. బుధవారం (జులై 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (జూలై 1) శ్రీవారిని మొత్తం 76 వేల 126 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 270 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 97 లక్షల రూపాయలు వచ్చింది.


