TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.4.16 కోట్లు

Published on: Tue Apr 8, 2025 10:31AM

 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (ఏప్రిల్ 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఎనిమిది కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది.

సోమవారం (ఏప్రిల్ 7) శ్రీవారిని మొత్తం 66 వేల 503 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 941 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 16లక్షల రూపాయలు వచ్చింది.