TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Mon Mar 31, 2025 9:29AM

వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తున్నది. గత వారం అంతా భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం (మార్చి 31) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 62 వేల 363 మంది దర్శించుకున్నారు. వారిలో 25,733 తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 65 లక్సల రూపాయలు వచ్చింది.