తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Thu Mar 27, 2025 9:41AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (మార్చి 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఏటీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక బుధవారం (మార్చి 26) శ్రీవారిని మొత్తం 75వేల 354 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28 వేల 510 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 54 లక్షల రూపాయలు వచ్చింది.


