TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Published on: Wed Mar 26, 2025 9:17AM

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. బుధవారం (మార్చి 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వెలుపతి వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక మంగళవారం (మార్చి 25) శ్రీవారిని మొత్తం 64 వేల 252 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 943 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 68లక్షల రూపాయలు వచ్చింది.