తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Published on: Sat Mar 8, 2025 8:23AM
.webp)
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మార్చి 8) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక శుక్రవారం (మార్చి7) శ్రీవారిని మొత్తం 67 వేల 127 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 910 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండా కానుకల ఆదాయం 3 కోట్ల 47లక్షల రూపాయలు వచ్చింది.


