తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Tue Feb 11, 2025 8:26AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఫిబ్రవరి 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నించిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక సోమవారం(ఫిబ్రవరి 10) శ్రీవారిని మొత్తం 70 వేల 169 మంది దర్శించుకున్నారు. వారిలో 23వేల039 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 33 లక్షల రూపాయలు వచ్చింది.


