తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Published on: Thu Jan 30, 2025 6:05AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (జనవరి 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక బుధవారం (జనవరి 29) శ్రీవారిని మొత్తం 62 వేల 710 మంది దర్శించుకున్నారు. వారిలో 15 వేల 635 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 14 లక్షల రూపాయలు వచ్చింది.


