తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
Published on: Fri Jan 3, 2025 8:09AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (జనవరి 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక మంగళవారం (జనవరి 2) శ్రీవారిని మొత్తం 62 వేల 085 మంది దర్శించుకున్నారు. వారిలో 15 వేల 680 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 17 లక్షల రూపాయలు వచ్చింది.


