TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు

Published on: Thu Dec 19, 2024 6:29AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం (డిసెంబర్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 16 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని మొత్తం 70 వేల 457 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 152 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 16లక్షల రూపాయలు వచ్చింది.