తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Published on: Tue Dec 17, 2024 7:18AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (డిసెంబర్ 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో పాతిక కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక సోమవారం (డిసెంబర్ 16) శ్రీవారిని మొత్తం 62 వేల 112 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల541 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 36లక్షల రూపాయలు వచ్చింది.


