తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Fri Nov 22, 2024 8:33AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (నవంబర్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 19 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక గురువారం (నవంబర్ 21) శ్రీవారిని మొత్తం 60 వేల 803 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 930 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 27 లక్షల రూపాయలు వచ్చింది.


