TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Published on: Sat Nov 16, 2024 8:38AM

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. శనివారం (నవంబర్ 16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డెరెక్ట్ క్యూలైన్ ద్వారా అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక శుక్రవారం (నవంబర్ 15) శ్రీవారిని మొత్తం 61 వేల 613 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 291 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల 12 లక్షల రూపాయలు వచ్చింది.