తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published on: Tue Nov 12, 2024 8:46AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. మంగళవారం (నవంబర్ 12) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 73 వేల917 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 161 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 82 లక్షల రూపాయలు వచ్చింది.


