TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

Published on: Mon Oct 21, 2024 9:21AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (అక్టోబర్ 21)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ క్యలైన్ ద్వారా అనుమతిస్తున్నారు.

ఇక శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు ఆరుగంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (అక్టోబర్ 20) శ్రీవారిని మొత్తం 73 వేల 926 మంది దర్శించుకున్నారు. వారిలో 23 వేల 726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 87లక్షల రూపాయలు వచ్చింది.