శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Published on: Wed Jul 12, 2023 9:38AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (జులై 11)మొత్తం 67 వేల 271 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.
28వేల 652 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చింది.
ఇక బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం మొత్తం పాతిక కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.


