శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.11 కోట్లు
Published on: Tue Jul 11, 2023 7:39AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జూలై10) శ్రీవారిని 64వేల 347 మంది భక్తులు దర్శించుకున్నారు. 28వేల 358 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల 11 లక్షల రూపాయలు వచ్చింది. ఇక మంగళవారం (జూలై 11) శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోందిజ


