తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Published on: Sat Jun 10, 2023 9:14AM
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రెండో శనివారం ఆదివారం కావడంతో భక్తులు తిరుమల కొండకు పోటెత్తారు.
శనివారం (జూన్ 10) టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ ఎటిసీ వరకూ సాగింది.
ఇక శుక్రవారం (జూన్ 9) శ్రీవారిని 74వేల 502 మంది దర్శించుకున్నారు. 38 వేల 52 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయలు వచ్చింది.


