శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు
Published on: Fri May 26, 2023 7:33AM
తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్నారు.
గురువారం(మే25) 74వేల583 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 40వేల583 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలు.
ఇక గురువారం (మే26) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. శిలా తోరణం వరకూ భక్తులు క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 36 గంటల సమయం పడుతోంది.


