తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Fri Oct 3, 2025 9:04AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత పది రోజులుగా భక్త జన సంద్రంగా మారిన తిరుమలలో శుక్రవారం ( అక్టోబర్ 3) కూడా భక్తుల రద్దీ కొనసాగుతున్నది.
శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది. ఇక గురువారం (అక్టోబర్ 2) శ్రీవారిని మొత్తం 75 వేల 188 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 640 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.


