తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Published on: Tue Sep 2, 2025 9:32AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (సెప్టెంబర్ 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఆరు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
ఇక సోమవారం (సెప్టెంబర్1 ) శ్రీవారిని మత్తం 65 వేల 384 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 512 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల మూడు లక్షల రూపాయలు వచ్చింది.


