TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Published on: Mon Sep 1, 2025 9:42AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అటువంటి తిరుమలలో భక్తుల ర ద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం (సెప్టెంబర్ 1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో మూడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (ఆగస్టు 31) శ్రీవారిని మొత్తం 70 వేల 310 మంది దర్శించుకున్నారు. వారిలో  21 వేల 886 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.